జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లిలో గురువారం ఉపాధి హామీ కూలీలు మట్టి తీస్తుండగా పురాతన విగ్రహాలు బయట పడ్డాయి. రాయితో చేసిన ఈ విగ్రహాలు దేవతామూర్తులను పోలి ఉన్నాయి. తవ్వకాల్లో విగ్రహాలు బయట పడ్డ విషయం తెలుసుకున్న ప్రజలు ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు. కాగా కూలీలు విగ్రహాలకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.