జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం దగ్గర దోస కాయలు అమ్ముకునే మహిళ మెడలో నుండి పుస్తెల తాడు దొంగతనం చేసి పారిపోయిన నిందితుల సిసి పుటేజీ ఫోటోలను పోలీసులు శనివారం విడుదల చేశారు. రెండు హెల్మెట్లు పెట్టుకుని పల్సర్ బైక్ పై ధర్మపురి నుండి శకల్ల వచ్చి, ఇక కనిపించకుండా పారిపోయారని, ఆచూకి తెలిసిన వాళ్ళు ఎస్ఐ ధర్మపురి 8712656824, సిఐ ధర్మపురి 8712656817 కి తెలియచేయగలరన్నారు.