దేవస్థానానికి ఐరన్ హుండీల బహూకరణ

72చూసినవారు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రూ. 80 వేల విలువ గల రెండు ఐరన్ హుండీలను యూనియన్ బ్యాంక్ డీజీఎం చేతుల మీదుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ కు శుక్రవారం అందజేశారు. అనంతరం దేవస్థానం పక్షాన స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ జక్కుల రవీందర్, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్