జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి పరీవాహక గ్రామాలైన చేగ్యం, పశిగామా, ముక్కారావుపేట్ , కోటిలింగాల వద్ద గల పుష్కర ఘాట్ గోదావరి వరద ప్రభావాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రాకూడదని సూచించారు. వారి వెంట డిఎస్పి రఘు చంధర్, ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉమా సాగర్ ఉన్నారు.