సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్

75చూసినవారు
సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్
జగిత్యాల ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో మే 3వ తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన స్థలాన్ని, సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్