జమ్మికుంటలో క్వింటాల్ పత్తి రూ. 7, 350

70చూసినవారు
జమ్మికుంటలో క్వింటాల్ పత్తి రూ. 7, 350
హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పత్తి మార్కెట్ లో పత్తి ధర రూ. 7, 350 పలికింది. సోమవారం మార్కెట్ కు రైతులు 19 వాహనాల్లో 315 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా రూ. 6, 800 నుంచి రూ. 7, 350 దాకా పలికింది. గోనె సంచుల్లో ఒక రైతు 4 క్వింటాలు తీసుకురాగా. రూ. 5, 800 పలికింది. అయితే గత వారంతో పోలిస్తే పత్తి ధర రూ. 50 పెరిగింది. నాణ్యమైన పత్తిని తీసుకురావాలని రైతులకు అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్