పిడుగుపాటుకు రైతు మృతి

66చూసినవారు
పిడుగుపాటుకు రైతు మృతి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు కంకణాల కృష్ణకుమార్ (33) పిడుగుపాటుకు మృతి చెందాడు. కృష్ణకుమార్ తన పాడి గేదెలను తీసుకొని మంగళవారం గ్రామ శివారులోని మైదానంలో మేపుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్