జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును అడిషనల్ ఎస్పీ భీమ్ రావు సోమవారం జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో డిఎస్పీ రఘు చందర్, సిఐఎస్ఎఫ్ అదికారులు, సీఐ రవి, ఎస్ఐలు పాల్గొన్నారు.