రుణమాఫీ అమలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

51చూసినవారు
రుణమాఫీ అమలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను రాయికల్ మండలం మహిత పూర్ రైతులు గురువారం కలిశారు. గ్రామంలో దాదాపు 200 మంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదని వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తా అని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గన్నె రాజీరెడ్డి, రఘుపతి రెడ్డి, గంప ఆనంద్, సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్