జగిత్యాల పట్టణంలోని 24 వ వార్డు కౌన్సిలర్ గుర్రం రమేష్ బుధవారం జగిత్యాలలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఆకుల నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొదట బిజెపిలో ఉన్న కౌన్సిలర్ ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు.