కరీంనగర్ పట్టణ కేంద్రంలోని బాలసదన్, శిశు గృహాలను బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేష్ సందర్శించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో బాలసదన్ లోని పిల్లలతో కలిసి ముచ్చటించారు, పిల్లలు బాల్యం నుండే మంచి నడవడికను అలవర్చుకోవాలని పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఎలాంటి న్యాయ పరమైన సలహాలు అవసరమైన సంప్రదించాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు.