రహదారిపై రైతుల రాస్తారోకో

581చూసినవారు
రహదారిపై రైతుల రాస్తారోకో
రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్ కి వడ్లు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల వడ్లు తడిచి మొలకలు వచ్చి నష్టపోతామని, ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చేసరికి కొనుగోలు జరగక, వర్షాలకు తడిసి తాము నష్టపోతున్నామని, వెంటనే తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్