గత కొద్ది రోజులుగా అతనిపై ఉన్న కేసులో కోర్టుకు అటెండ్ కాకుండా తప్పించుకు తిరుగుతున్న మెట్ పల్లికి చెందిన బొందు గణేష్ సింగ్ (24) అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేసి కోర్టు ముందు అతనిని ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేశామన్నారు. ఇంతకుముందు ఇతను మరణాయుధాలు కలిగి ఉన్నందున అతనిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు అయిందని వివరించారు.