రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్

81చూసినవారు
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారని నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, ఐలాపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ. 6 గ్యారెంటీల అమలును పక్కదారి పట్టించడానికి రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయనకు గుణపాఠం తప్పదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్