క్వారీలో బండరాయి తగిలి వలస కూలి మృతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపెల్లి క్వారీలో పనిచేస్తున్న ఆలకుంట ఉపేందర్(38)అనే వలస కూలి శుక్రవారం బండరాయి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. క్వారీలో బండలకు కాంప్రెసర్ తో రంద్రాలు వేస్తుండగా కాంప్రేసర్ చక్రం విరిగి బండ చాతి బాగంలో తగలడంతో మృతి చెందాడు. మృతుడు ఉపేందర్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపకు చెందిన వాడు.