చేతిపై సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

69చూసినవారు
చేతిపై సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య
వివాహమైన 17 రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది. తడగొండ భాగ్యలక్ష్మి (25) బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు అర చేతిపై తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఉంది. ఆగస్టు 18న యువతికి వివాహం జరిగింది. వివాహం తర్వాత మృతురాలి తల్లిదండ్రులు నిన్ననే అత్తారింట్లో వదిలి వెళ్లగా ఈ దారుణం జరిగింది.

సంబంధిత పోస్ట్