హాస్టల్లో కనీస వసతులు కల్పించాలని రోడ్డెక్కిన విద్యార్థులు

1884చూసినవారు
మంథని మండలం వెంకటాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు హాస్టల్ నందు వసతులు కల్పించాలని సోమవారం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ.. హాస్టల్ లో బాత్రూంలు సరిగా లేవని, కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకట కృష్ణ ధర్నా దగ్గరికి చేరుకొని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తా అని చెప్పటంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు.

సంబంధిత పోస్ట్