ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కిట్స్ ఫర్ కిడ్స్ ఇండియా ఎన్జీవో సహకారంతో అర్షనపల్లి యువి నేతృత్వంలో పాఠ్య పుస్తకాలను, స్కూల్ బ్యాగులను గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.