ఓదెల మండలం కనగర్తి, పొత్కపల్లి, గూడెం గ్రామాల్లో ఆదివారం రాత్రి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మద్దతుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరగబోయే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.