గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసిన పశు వైద్య సిబ్బంది
శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో శనివారం మండల పశు వైద్యాధికారి డాక్టర్ భాగ్యలక్ష్మి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు 163 పశువులకు టీకాలు వేశారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గాలి కుంటి వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేయిస్తుందని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మౌనిక, లలిత, గోపాలమిత్ర సంపత్, పశుమిత్ర లక్ష్మణ్ పాల్గొన్నారు.