ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

5114చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన అక్కన్నపేటలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అక్కన్నపేట రోడ్డుపై ఎదురుగా వస్తున్న స్కూటీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా రోడ్డు పక్కన ఉన్న మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబాలు ఆందోళన చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్