రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హల్ లో నియోజవర్గ స్థాయి కార్యాలయాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించెందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తి చేశారు.