రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జామ మజీద్, సుభాష్ నగర్ లోని మహమ్మదియా మజీద్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు.