మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

59చూసినవారు
వన మహోత్సవ కార్యక్రమంలో బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని బాలనగర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, కమిషనర్ అన్వేష్, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్