సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట శివారులో చిరుత పులి కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. లింగంపేట గ్రామానికి చెందిన ఈగ రాజేశం మేక గురువారం తప్పిపోయి శుక్రవారం అటవీ ప్రాంతంలో కళేబరాలు దొరికాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.