ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్ పి. గౌతమిలతో కలిసి ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల సూచించే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.