మేడిపల్లి మండలం పసునూరుకు చెందిన బెజ్జంకి అభిలాష్ కథలాపూర్ మండలం గంభీర్పూర్ శివారులో మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 31న తన ఫ్రెండ్ను రాజలింగంపేటలో వదిలి కోరుట్లకు వెళుతుండగా.. గంభీర్ పూర్ గ్రామశివారులో వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న కందకంలోని పడి మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు చేసి నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.