యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: ఆర్ఎస్సై దిలీప్

71చూసినవారు
యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: ఆర్ఎస్సై దిలీప్
ఈనెల 13న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా పోస్టర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఆర్ఎస్సై దిలీప్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని ఆర్ఎస్ఐ దిలీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు, గ్రామ ప్రజలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్