ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవీకాలం ఈ నెలలో ముగిసిపోయింది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బంధువులుగా ఒక్కరూ కూడా లేకపోవడం తొలిసారి. పార్టీ సంక్షోభంలో, కష్టకాలంలో ఉన్నప్పుడు మోరల్గా నిలబడాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావు, సంతోష్రావు తదితరులంతా పార్లమెంటుకు దూరంగా ఉండిపోవడం పార్టీలోనే చర్చనీయాంశమైంది.