తన భర్త కేజ్రీవాల్ రాజకీయ కుట్రకు బలయ్యారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సాక్షుల తప్పుడు వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని తెలిపారు. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఎంపీ శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్కు మద్దతివ్వాలని ప్రజలను కోరారు.