లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా తెలియజేశారు. వరుసగా ఏడోసారి విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చేసింది. మార్చి 16 వరకు ED వేచి ఉండాలని సోషల్ మీడియాలో పేర్కొంది. పదే పదే సమన్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయప్రక్రియను ED గౌరవించాలని సూచించింది.