ఏడోసారి ED విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు

85చూసినవారు
ఏడోసారి ED విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా తెలియజేశారు. వరుసగా ఏడోసారి విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చేసింది. మార్చి 16 వరకు ED వేచి ఉండాలని సోషల్ మీడియాలో పేర్కొంది. పదే పదే సమన్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయప్రక్రియను ED గౌరవించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్