రాంచీ మైదానం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (51*) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిది 17వ అర్ధశతకం. ప్రస్తుతం భారత్ స్కోరు 20 ఓవర్లకు 90/1. క్రీజ్లో రోహిత్తోపాటు శుభ్మన్ గిల్ (2) ఉన్నాడు. టీమ్ఇండియా విజయానికి ఇంకా 102 పరుగులు అవసరం. నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ (37) జో రూట్ బౌలింగ్లో ఔటయ్యాడు.