కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కొడంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ‘నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని అన్నారు. కాంగ్రెస్ను ఓడగొట్టాలని మాట్లాడుతున్నారు.. సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ఓడించాలా? అని అడిగారు.