TG: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్నాహ్న భోజన పథకంపై విద్యా కమిషన్.. ప్రభుత్వానికి కీలక నివేదిక అందజేసింది. ఈ రిపోర్టులో 'ప్రతీవారం పాఠశాలలకు బిల్లులు చెల్లించాలి. ఇంటర్ కళాశాలల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి. విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్స్, ఇతర సామాగ్రిని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచే కొనాలి' అని ఆ నివేదికలో తెలిపింది.