జాతీయ జెండాను ఆవిష్కరించిన సొసైటీ చైర్మన్

362చూసినవారు
జాతీయ జెండాను ఆవిష్కరించిన సొసైటీ చైర్మన్
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, జాతిపిత గాంధీకి పూలమాల వేసి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈవో వీరారెడ్డి, వైస్ చైర్మన్ వడ్ల కుంట ఇశ్రాయేలు, సొసైటీ డైరెక్టర్లు, శీలం పుల్లారెడ్డి, తల్లపురెడ్డి రామిరెడ్డి, బొగ్గుల వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తపల్లి మరియమ్మ, బాణాల శీను, లక్కిరెడ్డి కృష్ణా రెడ్డి, వేమి రెడ్డి వెంకట్ రెడ్డి, శీలం జలంధర్ రెడ్డి, సిబ్బంది ప్రసాద్, సాంబశివరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.