మధిరలో పారిశుద్ధ్యలేమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

577చూసినవారు
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు నందు గత కొంతకాలంగా మున్సిపాలిటీ సిబ్బంది రాకపోవడంతో డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకుపోయి మరుగు నీరు నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్