రూరల్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

85చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం రైతాంగ సమస్యలపై మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని మండల అధ్యక్షుడు బెల్లం వేణు డిమాండ్ చేశారు. అటు రైతులకు ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్