కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎర్ర శ్రీనివాసరావు, షేక్ బషీరుద్దీన్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేటలో జరిగిన సిపిఎం శాఖ మహాసభలో వారు మాట్లాడుతూ. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.