సత్తుపల్లి-అన్నపురెడ్డిపల్లి మధ్య నిలిచిన రాకపోకలు

72చూసినవారు
సత్తుపల్లి మండలం కిష్టారం-చెరుకుపల్లి గ్రామాల మధ్య ముగ్గువాగు ఆదివారం ఉధృతంగా ప్రవహిస్తుంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగు వరద నీటితో పోటెత్తింది. దీంతో సత్తుపల్లి-అన్నపురెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఆర్టీసీ సర్వీసులతో పాటు ఆ గ్రామాలకు నిత్యావసరాలు వెళ్లే పరిస్థితి లేక ఇతర మార్గాల గుండా ప్రజలు చేరుతున్నారు. ప్రజలు వాగులను దాటవద్దని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్