పివైఎల్ రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి: రాకేష్

81చూసినవారు
ఈనెల 13, 14వ తేదీల్లో మధిరలో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ తరగతులను జయప్రదం చేయాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ అన్నారు. శనివారం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యధికంగా యువ సంపద కలిగిన దేశం ఇండియా అని, ప్రస్తుత పాలకులు యువశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని, మద్యం, డ్రగ్స్, గంజాయి, తదితర మత్తులో ఉండేల యువతను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్