రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో ఇల్లందు -ఖమ్మం ప్రధాన రహదారిపై శనివారం చోటుచేసుకుంది. రామనర్సయ్య నగర్ గ్రామానికి చెందిన తానంగి నరసింహారావు(35) బైక్ పై ఖమ్మం వెళ్తుండగా పండితాపురం వద్ద లారీ డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయించుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.