ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం
కొలతలకు సంబంధం లేకుండా ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలని. ఉపాధి కార్మికులకు 200 రోజులు పని పొడిగించి కుటుంబంలో అందరికీ పని కల్పించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ ఐ పి కే ఎం ఎస్) రాష్ట్ర నాయకులు బందెల వెంకయ్య , జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు శుక్ర వారం డిమాండ్ చేసారు ఉపాధి హామీని కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందన్నారు.