ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. '2004, 2019లో నన్నెవరూ ఓడించలేదు. ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే మేము ఓడిపోయాం. పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయాం. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదు' అని అన్నారు.