ఈతకి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి
వైరా మండలానికి చెందిన అకిరా నందన్ అనే యువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. అకిరా నందన్ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురంలో స్నేహితురాలి వివాహానికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై మఠంపల్లి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.