కలుషిత నీటిపై ఫిర్యాదు చేస్తే పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు

55చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మురుగు నీరు సరఫరాపై ఫిర్యాదు చేస్తే పంచాయతీ కార్యదర్శి బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నీరు తాగడంతో వంటిపై దద్దులు వస్తున్నాయని దీంతో ఆసుపత్రులకు వెళ్ళుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు సైతం ఇదే నీరు సరఫరా జరుగుతుండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్