భారత తొలి ప్రధాని నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు (Video)

70చూసినవారు
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాళులు అర్పించారు. సోమవారం ఉదయాన్నే ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్‌కు వెళ్లి ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అదేవిధంగా ఖర్గే, రాహుల్‌గాంధీ తమతమ అధికారిక ఎక్స్‌ ఖాతాల ద్వారా కూడా నెహ్రూకు నివాళులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్