ఘోర విషాదం.. 2000 మందికి పైగా మృతి

24739చూసినవారు
ఘోర విషాదం.. 2000 మందికి పైగా మృతి
పాపువా న్యూగినీ దేశంలో కొండచరియలు విరిగిపడటంతో 2,000 మందికిపైగా సజీవ సమాధి అయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతుండటంతో.. శిథిలాల కింద ఉన్న క్షతగాత్రుల ప్రాణాలకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు సవాల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్