హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

79చూసినవారు
హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు బాలికలను, ఓ బాలుడిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్