ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆయబోయే మొదటి రెండు మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నారు. రాహుల్ భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ కెప్టెన్సీ కూడా వద్దనుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో అక్షర్ పటేల్ DCకి తొలిసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన వేళ రాహుల్ తొలి రెండు మ్యాచ్లకు దూరమవ్వడం జట్టుకు కొంత మైనస్ కానుంది.