భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం

74చూసినవారు
భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద చైనా తయారు చేసిన డ్రోన్‌తో పాటు 500 గ్రాముల హెరాయిన్‌ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) శనివారం వెల్లడించింది. పక్కా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. చండీగఢ్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని నేస్తా గ్రామానికి ఆనుకుని ఉన్న పొలాల్లో ఇవి పట్టుబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్